Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయలో పడిన బస్సు : 16 మంది అమర్నాథ్ యాత్రికుల దుర్మరణం

అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు దుర్మరణం పాలైన ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరో విషాద ఘటన జరిగింది.

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (17:34 IST)
అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు దుర్మరణం పాలైన ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరో విషాద ఘటన జరిగింది. కొంతమంది అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఒకటి ఆదివారం మధ్యాహ్నం అదుపుతప్పి లోయలో పడింది. రాంబాన్ జిల్లాలోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. జేకే02వై-0594 నెంబర్ బస్సు డ్రైవర్ అదుపుతప్పడంతో లోయలోకి దొర్లిపడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
ప్రమాద వార్త తెలిసిన వెంటనే రాంబాన్ జిల్లా యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్ 90, 40వ బెటాలియన్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తీవ్రంగా గాయపడిన యాత్రికులను ఆసుపత్రికి తరలించేందుకు వైమానిక దళ హెలికాప్టర్‌ను సైతం రంగంలోకి దించారు. ఈ ప్రమాద సంఘటనను జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. 16 మంది యాత్రికులు మరణించగా, 19 మంది గాయపడిన యాత్రికులను హెలికాప్టర్‌లో చికిత్సకు తరలిస్తున్నామని, మరో 8 మంది స్వల్పంగా గాయపడ్డారని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments