Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వారంలో 15 మంది పాక్ రేంజర్లను కాల్చిపారేశాం : బీఎస్ఎఫ్

యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హోరాహోరీ కాల్పుల్లో గత వారం రోజుల్లో 15 మంది పాక

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (08:47 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హోరాహోరీ కాల్పుల్లో గత వారం రోజుల్లో 15 మంది పాక్‌ రేంజర్లను కాల్చిపారేసినట్టు భారత సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రకటించింది. పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడినట్లు తెలిపింది. 
 
అదేసమయంలో జమ్మూకాశ్మీర్‌లోని జమ్ము, కథువా, పూంఛ్‌, రాజౌరి జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి గురువారం అర్థరాత్రి నుంచి పాక్‌ బలగాలు పెద్ద ఎత్తున కాల్పులను ప్రారంభించాయి. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం వరకు కాల్పులు కొనసాగాయి. పాక్‌ కవ్వింపు చర్యలకు భారత బలగాలు ధీటుగా జవాబిచ్చాయి. 
 
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఐదుగురు అనుమానిత లష్కరే తాయిబా ఉగ్రవాదులు సహా ఓ పోలీసును భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మరోపక్క, 'స్వాతంత్ర సమరం మరింత ముందుకు' అంటూ లష్కరే ప్రకటనలు కనిపించాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments