Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై విమానాశ్రయంలో రూ.100 కోట్ల హెరాయిన్ స్వాధీనం

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (22:36 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు టాంజానియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి భారత్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. 
 
దీంతో అధికారులు నిఘా పెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియా నుంచి చెన్నైకు వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఆసమయంలో 43 యేళ్ల మహిళను, 45 యేళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ రాజన్‌ చౌదరి తెలిపారు.
 
హెరాయిన్‌ను పాలిథిన్‌ సంచుల్లో కట్టి వాసననురాకుండా ఇందులో మసాలా పొడిని చల్లినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తన సహాయకుడు వైద్యం కోసం బెంగళూర్‌ వెళ్తున్నట్లు చెప్పి మహిళ వీసా పొందిందని అధికారులు విచారణలో గుర్తించారు. బెంగళూర్‌కు నేరుగా విమానం లేకపోవడంతో చెన్నైలో దిగి పట్టుబడినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments