Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై విమానాశ్రయంలో రూ.100 కోట్ల హెరాయిన్ స్వాధీనం

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (22:36 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు టాంజానియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి భారత్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. 
 
దీంతో అధికారులు నిఘా పెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియా నుంచి చెన్నైకు వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఆసమయంలో 43 యేళ్ల మహిళను, 45 యేళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ రాజన్‌ చౌదరి తెలిపారు.
 
హెరాయిన్‌ను పాలిథిన్‌ సంచుల్లో కట్టి వాసననురాకుండా ఇందులో మసాలా పొడిని చల్లినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తన సహాయకుడు వైద్యం కోసం బెంగళూర్‌ వెళ్తున్నట్లు చెప్పి మహిళ వీసా పొందిందని అధికారులు విచారణలో గుర్తించారు. బెంగళూర్‌కు నేరుగా విమానం లేకపోవడంతో చెన్నైలో దిగి పట్టుబడినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments