Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికులకు సహకరించాడని.. 13ఏళ్ల బాలుడిని శూలాలకు గుచ్చి చంపేశారు..

ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరి

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (11:12 IST)
ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరికి చెందిన అరుణ్‌కుమార్‌ (13) 8వ తరగతి చదువుతున్నాడు. అతని ఇంటిపక్కనే ఉన్న బంధువు కలైసెల్వి (18).. అదే గ్రామానికి చెందిన అరుళ్‌ (23)తో ప్రేమలో పడింది. వారిద్దరికీ అరుణ్‌ ‘మాట సాయం’ చేస్తున్నట్లు కలైసెల్వి బంధువులకు అనుమానం వచ్చింది. 
 
ఈ విషయం తెలియరావడంతో మంగళవారం సాయంత్రం నుంచి అరుణ్‌కుమార్‌ కనిపించకుండాపోయాడని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వీరమంజేరి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మణి ఆండవర్‌ ఆలయ త్రిశూలాలకు అరుణ్‌కుమార్‌ శవం వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు జరిపిన దర్యాప్తులో అతన్ని తానే చంపేశానని కలైసెల్వి సోదరుడు కదివరన్‌ అంగీకరించాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments