కేబుల్ వంతెన కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబీకులు 12 మంది మృతి

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (13:11 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై ఉన్న పురాతన కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 140 దాటిపోయింది. ఈ మృతుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్‌‍కోట్ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ కుటుంబ సభ్యులు 12 మంది ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరంతా మోహన్ భాయ్ సోదరి తరపున బంధువులుగా గుర్తించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో కేబుల్ వంతెనపై సుమారుగా 500 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో వంతెన తెగిపోవడంతో వారంతా మచ్చూ నదిలో పడ్డారు. వీరిలో ఈత తెలిసినవారు ఈదుకుంటూ గట్టుకు చేరుకోగా మరో 170 మంది సహాయక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య 141కు చేరింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమైవున్నాయి.
 
మరోవైపు, ఒకేసారి 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో తాను 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్టు తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన బోరున విలపించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోందన్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments