Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ : ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో 11 మంది మృతి

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (12:47 IST)
ఉత్తరాఖండ్‌లో విషాదం నెలకొంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో 11 మంది మృతులై తేలారు. భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా అక్టోబర్‌ 18 నుండి వీరి ఆచూకీ కానరాలేదు. దీంతో రంగంలోని వైమానిక దళం..వారు కనిపించకుండా పోయిన ప్రాంతం.. ఉత్తరాఖండ్‌కు 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లమ్‌ఖగా పాస్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతోంది.
 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాను.. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో లమ్‌ఖగా పాస్‌ ఒకటి. ఈ మార్గం నుండి ఇప్పటి వరకు 11 మంది మృత దేహాలను వెలికితీశారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో పర్యటకులు, పోర్టర్లు, గైడ్లు ఉన్నారు. 
 
అక్టోబర్‌ 20న అధికారుల నుండి వచ్చిన కాల్‌తో భారత వైమానిక దళం స్పందించి... తేలికపాటి హెలికాఫ్టర్లను రెండింటినీ హిల్‌ స్టేషన్‌ హర్సిల్‌కు పంపింది. జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం హెలికాఫ్టర్‌లో 19,500 అడుగుల ఎత్తుకు చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం కూడా ఈ ఆపరేషన్‌లో  పాల్గొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments