Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ఫైవ్‌స్టార్ డీలక్స్ గదులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (15:15 IST)
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పది వేల మార్కును దాటిపోయాయి. అలాగే, ఈ వైరస్ బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కరోనా రోగుల కోసం బెడ్లు, కనీక సదుపాయాలు లభించక అవస్థలు పడుతున్నారు. 
 
కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. బెంగళూరులో ఇటీవల పునరుద్ధరించిన కుమార కృప అతిథి గృహంలోని వంద డీలక్స్‌ గదులను కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 
 
ఈ ఆదేశాలపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ వైపు కరోనా సోకిన సాధారణ ప్రజలకు దవాఖానలో చోటు, వసతులు లేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్‌ గదులను కరోనా కేంద్రాలుగా కేటాయించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్దించుకున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments