Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరట్‌లో విషాదం.. శిథిల భవనం కూలి పది మంది మృత్యువాత

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శిథిలావస్థకు చేరిన ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
 
మీరట్‌లోని స్థానిక జకీర్ కాలనీలో ఉన్న ఈ భవనం 50 ఏళ్ల నాటిది. శిథిల పరిస్థితుల్లో ఉన్న భవనం గత సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద ఓ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఒక కుటుంబం మొత్తం సమాధి అయిపోయింది. కొన్ని పశువులు మృత్యువాత పడ్డాయి.
 
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పక్క వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. స్థానిక వలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. 
 
అర్ధరాత్రి 2 గంటల వరకు శిథిలాలు తొలగించగా, ఈ ఉదయం మళ్లీ ప్రారంభమయ్యాయి. కూలిన భవనం ఇరుకు ప్రదేశంలో ఉండడంతో బుల్డోజర్లు అక్కడి వెళ్లలేకపోతున్నాయని పోలీసులు తెలిపారు.
 
తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన నఫీసా (63), ఫర్హానా (20), అలీసా (18), సాజిద్ (40), సానియా (15), సాఖిబ్ (11), సిమ్రన్ (15 నెలలు), ఆలియా (6), రిజా (7), రిమ్సా (5 నెలలు) గా గుర్తించారు. భవనం కూలిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments