Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌ రహదారులు రక్తసిక్తం.. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (08:42 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదాల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ఉరి ప్రాంతంలో ప్రయాణికుల వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 
 
అలాగే, కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ ప్రాంతంలో రహదారి పనుల్లో ఉన్న స్నోకర్ వాహనం ప్రమాదానికి గురికావడంతో మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, ఈ ప్రమాదాల్లో చనిపోయిన మృతుల కుంటుబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కిష్త్వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ దివాన్స్ యాదు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణఆలు కోల్పోయిన వారి కుటంబాలకు అండగా ఉంటామని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments