Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. పదిమంది మృతి

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (08:53 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొనడంతో.. బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
  
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ – ఔరంగాబాద్ రహదారిపై నందూర్నాక వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఈ ఘటనను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే ధృవీకరించారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments