Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది నగరాల్లో పరుగులు తీయనున్న బుల్లెట్ రైళ్లు..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:48 IST)
చెన్నై-బెంగళూరు, ముంబై-ఢిల్లీ వంటి పది పట్టణాలకు కొత్త మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ నిర్ణయించింది. చైనా, జపాన్ దేశాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో భారత్‌లో కూడా బుల్లెట్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. 
 
ఢిల్లీ నుంచి ముంబై, కొల్‌కతా, వారణాసి, భోపాల్, అమృతసర్, అహ్మదాబాద్ వంటి ఆరు మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇదేవిధంగా నాగ్‌పూర్-ముంబై, పాట్నా-కోల్‌కతా మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మైసూర్-బెంగళూరు-చెన్నైల మధ్య బుల్లెట్ రైళ్లను కూడా నడిపేందుకు రంగం సిద్ధమైంది.
 
మొత్తం మీద దేశ వ్యాప్తంగా 10 మార్గాల్లో బుల్లెట్ల రైళ్ల కోసం రైల్వే శాఖ పథకం వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాలని రైల్వేశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం వేయాల్సి వుంది. 2025 లేదా 2026లో ఈ బుల్లెట్ రైళ్లు పూర్తి స్థాయిలో నడపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments