Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన మంచు చరియలు.. 10 మందితో ఉన్న వాహనం సమాధి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో పది మందితో వెళుతున్న స్కార్పియో వాహనం ఒకటి మంచు పెళ్లల కింద సమాధి అయిపోయింది. ఈ వాహనం కోసం ఇండియన్ ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లడఖ్ ప్రాంతంలో 10 మందితో స్కార్పియో వాహనం వెళుతోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి భారీ మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ వార్త తెలియగానే రంగంలోకి దిగిన సైనిక సిబ్బంది.. భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. 
 
కాగా, మన దేశంలో అత్యంత ఎత్తున ఉన్న రహదారుల్లో ఖర్దూంగ్ లా పాస్ రహదారి కూడా ఒకటి. లేహ్ కు ఉత్తర ప్రాంతంలో షయోక్, నుబ్రా లోయలను కలుపుతూ ఈ రహదారి ఉంటుంది. ఈ 10 మందిలో ఒకరు మృతి చెందగా, మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments