Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన మంచు చరియలు.. 10 మందితో ఉన్న వాహనం సమాధి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో పది మందితో వెళుతున్న స్కార్పియో వాహనం ఒకటి మంచు పెళ్లల కింద సమాధి అయిపోయింది. ఈ వాహనం కోసం ఇండియన్ ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లడఖ్ ప్రాంతంలో 10 మందితో స్కార్పియో వాహనం వెళుతోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి భారీ మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ వార్త తెలియగానే రంగంలోకి దిగిన సైనిక సిబ్బంది.. భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. 
 
కాగా, మన దేశంలో అత్యంత ఎత్తున ఉన్న రహదారుల్లో ఖర్దూంగ్ లా పాస్ రహదారి కూడా ఒకటి. లేహ్ కు ఉత్తర ప్రాంతంలో షయోక్, నుబ్రా లోయలను కలుపుతూ ఈ రహదారి ఉంటుంది. ఈ 10 మందిలో ఒకరు మృతి చెందగా, మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments