Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivratri 2025: శివుడికి పసుపు ఆవాలు సమర్పిస్తే.. ఏం జరుగుతుంది?

సెల్వి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (10:28 IST)
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మహా శివరాత్రి నాడు, ప్రజలు రోజంతా శివుడిని పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారు. అంతే కాకుండా, ఈ రోజున భక్తులు శివలింగానికి వివిధ వస్తువులను సమర్పించి పూజిస్తారు. 
 
జలాభిషేకం చేయడం వల్ల ఇంటికి శాంతి, ఆనందం లభిస్తాయని విశ్వాసం. కానీ మీరు ఏమి సమర్పించినా, సమర్పించకపోయినా, ఈ శివరాత్రి నాడు శివుడికి ఒక్క వస్తువును సమర్పిస్తే, మీ కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. 
 
ముఖ్యంగా పసుపు ఆవాలతో శివుడిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి నాడు శివుడికి దీన్ని సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు ఆవాలు పూజకు పవిత్రంగా భావిస్తారు. అందుకే వారు దానిని పూజలో ఉపయోగిస్తారు.
 
అదేవిధంగా, సానుకూల శక్తి పెంపొందుతుంది. మీరు ప్రతికూల శక్తిని తగ్గించుకోవాలనుకుంటే, దానిని శివలింగానికి సమర్పించవచ్చని విశ్వాసం. దీనిని శివలింగానికి సమర్పించడం వల్ల గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది.
 
శివునికి పసుపు ఆవాలతో శివుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుడికి జలాభిషేకం చేసి, ఈ పసుపు ఆవాలను శివుడికి సమర్పించండి. దీన్ని సమర్పించడం ద్వారా, ఇంట్లో ఉన్న ప్రతికూలత అంతా తొలగిపోతుంది. అలాగే, శివుని ఆశీస్సులు మీపై ఉండుగాక. కష్టాలన్నీ తీరిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

లేటెస్ట్

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments