Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi Nomination: మోడీ ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు వుండవంటున్న ఖర్గే

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (11:33 IST)
నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలనేవి జరగకుండా చేస్తారనని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీది నియంతృత్వ పోకడ అనీ, అలాంటివారికి తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.
 
మోడీకి దమ్ముంటే పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలు అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమేరకు ఆయన వ్యాఖ్యలు చేసారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ ను అరెస్టు చేసినట్లుగా అంబానీ, అదానీలను అరెస్ట్ చేసే సత్తా వారికి వుందా అని ప్రశ్నించారు.
 
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అరెస్టయిన నాయకులందరినీ బయటకు తీసుకుని వస్తామని అన్నారు. నరేంద్ర మోడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై వున్నదంటూ పిలుపునిచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments