లోక్‌సభ ఎన్నికలు : తెలంగాణాలో రూ.202 కోట్ల నగదు స్వాధీనం

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీలుగా పంపిణీ చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న డబ్బును ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ గుర్తించి సీజ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం రూ.202 కోట్ల విలువైన నగదుతో పాటు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు రూ.202 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోగా, ఇందులో రూ.76.65 కోట్ల నగదును, రూ.43.57 కోట్ల మద్యం, రూ.29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, సోమవారం హైదరాబాద్ నగరంలో రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి ఎనిమిది ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో రూ.1,81,70,324 నగదు పట్టుబడింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యధికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.74 లక్షలకు పైగా పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments