Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

Advertiesment
ganesh
ధనం రాబడి కోసం, ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. శుక్రవారంలో వచ్చే శుక్ర హోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లాలి. ఆలయంలో రావిచెట్టు వుండేలా చూసుకోవాలి. 
 
రావిచెట్టు కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం వుంటే ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును 108 సార్లు శుక్ర హోరలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షణలు చేసే సమయంలో "ఓం లక్ష్మీ గణపతియే నమో నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షణలు చేయాలి. 
 
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9 గంటలను శుక్రహోరగా పరిగణిస్తారు. ఈ శుక్రహోరలో శుక్రవారం రావిచెట్టు కింద కొలువైన వినాయకుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ధనాదాయం వుంటుంది. సర్వశుభాలు సిద్ధిస్తాయి. 
webdunia
Peepal Tree
 
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7 గంటల సమయంలో వినాయకుడిని 108 సార్లు ప్రదక్షణలు చేయడం అలాగే శనివారం (20-04-2024) మధ్యాహ్నం 12-1 గంట లోపు వినాయకుడిని ప్రదక్షణలు చేసి.. 16 నెయ్యి దీపాలను వెలిగించి.. పై మంత్రాన్ని పఠించడం ద్వారా కచ్చితంగా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, ధాన్యాలకు కొదవ వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...