Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా స్టాఫ్ అంతా పడుకున్నారు... నరసాపురంలో నాగబాబుకి చుక్కలు చూపిస్తా...

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (18:09 IST)
ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ నామినేషన్‌ను భీమవరంలో తిరస్కరించారు. ఆయన భీమవరంతో పాటు మెగా బ్రదర్ పోటీ చేస్తున్న నరసాపురం లోక్ సభ స్థానానికి కూడా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరాజయం ఖాయమైందని చెపుతున్న పాల్, నరసాపురంలో నాగబాబుకి చుక్కలు చూపిస్తానంటున్నారు. 
 
ప్రజలు ప్రజాశాంతి పక్షాన వున్నారని అంటున్నారు. మొత్తం 175 చోట్ల పోటీ చేసేందుకు తను విజయవాడలోని హోటల్ ఐలాపురంలో బస చేసి బీ ఫార్మ్స్ దగ్గరపెట్టుకుని నిన్న రాత్రి తెల్లవారు జాము వరకూ మేలుకునే వున్నానంటూ చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం తనకోసం పనిచేస్తున్న స్టాఫ్ అంతా పడుకున్నారనీ, అందువల్ల ఆయా పార్టీలకు ఎవరైతే రెబల్స్ వున్నారో వాళ్లంతా ప్రజాశాంతి పార్టీ కోసం పనిచేయాలని, మన ప్రభుత్వం వస్తే అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఓ సెల్ఫీ వీడియో ద్వారా పిలుపునిచ్చారు. మరి ప్రజాశాంతి పార్టీకి చెందిన అభ్యర్థులు ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారో... తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments