Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశ్ రాజ్‌కి 3 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉన్నాయ్.. జగన్ ఫిర్యాదు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:37 IST)
నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్‌కి నాలుగు ఓట్లు ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన జగన్ కుమార్ అనే సామాజిక వేత్త కర్ణాటక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ప్రకాశ్ రాజ్‌కు మూడు రాష్ట్రాల్లో నాలుగు ఓట్లు ఉన్నాయని, అది చట్టరీత్యా నేరం అంటూనే ఇందుకు ఒక్క సంవత్సరం జైలు శిక్ష కూడా వెయ్యవచ్చునని సామాజిక వేత్త జగన్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం అతని అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలని జగన్ కుమార్ కోరుతున్నారు.
 
ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరులో ఒక ఓటు.. తమిళనాడులోని వేలచ్చేరిలో రెండు ఓట్లు.. తెలంగాణలోని శేర్‌లింగంపల్లిలో ఒక ఓటు ఉందని, అలాగే ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఓట్లు యాక్టీవ్‌గా ఉన్నాయని, ఇది చట్టంలోని సెక్షన్ 17,18 మరియు సెక్షన్ 31లను ఉల్లంఘించడమే అని జగన్ కూమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.
 
ప్రకాశ్ రాజ్‌ ఓట్లకు సంబంధించిన కార్డుల కాపీలను కూడా జగన్ కుమార్ తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. వెంటనే ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని జగన్ కుమార్ ఎన్నికల సంఘాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments