Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు : 26న వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:58 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మూడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులోభాగంగా ఆయన గురువారం వారణాసిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 
 
బీజేపీ అభ్యర్ధిగా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వారణాసి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ గేట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీ పురాతన మందిరాలు, గంగా నది ఘాట్లను కలుపుతూ ముందుకు సాగనుంది. 
 
ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన నేతలు కూడా పాల్గొననున్నారు. 'దశాశ్వమేథ్' ఘాట్ వద్ద సాయంత్రం 7 గంటలకు ర్యాలీ ముగించి గంగా హారతిలో పాల్గొంటారు. మోడీ. నగరంలోని ప్రముఖులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఇక శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ వేసే ముందు ఉదయం 9 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం కాలభైరవ ఆలయంలో పూజలు చేసి కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. నామినేషన్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వెంట బీజేపీ నేతలతో సహా, ఉద్దవ్ థాక్రే, నితీశ్ కుమార్ వంటి ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments