Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కుడిచేతి చూపుడు వేలికి సిరా గుర్తు.. వివరణ కోరిన ఈసీ

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:30 IST)
దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులోభాగంగా, ఈనెల 11వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగగా, 18వ తేదీన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ రెండో దశలో తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. వేలూరు లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. అలాగే, 18 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. 
 
అయితే, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన స్టెల్లా మెరీస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఓటు వేశారు.
 
అయితే, ఎన్నికల సిబ్బంది ఆయనకు కుడిచేతి చూపుడు వేలికి ఇంకు మార్కు వేశారు. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఓటు వేసేందుకు వెళ్లే వ్యక్తికి ఎడమ చేయి చూపుడు వేలిపై ఇంకు మార్కు వేస్తారు. చూపుడు వేలికి ఏదేని గాయమైవున్నట్టయితే పక్కన ఉండే మధ్యవేలికి వేస్తారు.
 
కానీ, రజినీకాంత్‌కు మాత్రం కుడిచేతి చూపుడు వేలికి ఈ మార్కు వేశారు. దీనిపై జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ కోరినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు కోరారు. మొత్తంమీద రజినీకాంత్ ఏది చేసినా అది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీని ప్రారంభించిన ఆయన ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments