Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఎన్నికల ఏజెంటుగా రాముడు.. ప్రజాస్వామ్యం దెబ్బ రుచిచూపిస్తా : మమత వార్నింగ్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:54 IST)
భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తాడని, అంటే రాముడిని బీజేపీ ఎన్నికల ఏజెంటుగా మార్చివేసిందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా, పురూలియాలో జరిగిన సభలో ఆమె పాల్గొని బీజేపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ టోల్ కలెక్టర్‌గా అభివర్ణించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధానికి రుచి చూపిస్తానని ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో అక్రమ మార్గంలో, కేంద్ర బలగాలను ఉపయోగించి ఓటర్లతో బలవంతంగా బీజేపీకి ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. 
 
అదేసమయంలో బీజేపీ నేతలకు ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తారన్నారు. అంటే.. రాముడిని బీజేపీ ఓ ఎన్నికల ఏజెంటుగా ఉపయోగించుకుంటుందంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాముడి గుడి కట్టితీరుతామని హడావుడి చేసే బీజేపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క రామాలయమైనా కట్టించారా అని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments