Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఎన్నికల ఏజెంటుగా రాముడు.. ప్రజాస్వామ్యం దెబ్బ రుచిచూపిస్తా : మమత వార్నింగ్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:54 IST)
భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తాడని, అంటే రాముడిని బీజేపీ ఎన్నికల ఏజెంటుగా మార్చివేసిందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా, పురూలియాలో జరిగిన సభలో ఆమె పాల్గొని బీజేపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ టోల్ కలెక్టర్‌గా అభివర్ణించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధానికి రుచి చూపిస్తానని ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో అక్రమ మార్గంలో, కేంద్ర బలగాలను ఉపయోగించి ఓటర్లతో బలవంతంగా బీజేపీకి ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. 
 
అదేసమయంలో బీజేపీ నేతలకు ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తారన్నారు. అంటే.. రాముడిని బీజేపీ ఓ ఎన్నికల ఏజెంటుగా ఉపయోగించుకుంటుందంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాముడి గుడి కట్టితీరుతామని హడావుడి చేసే బీజేపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క రామాలయమైనా కట్టించారా అని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments