Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుదుట బొట్టు బిళ్లల ప్యాకెట్‌నూ వదలని చౌకీదార్ మోడీ...

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:39 IST)
"నేను మీ చౌకీదారుని" అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి శుభలేఖలను కూడా బీజేపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించారు. 
 
మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీకి ఓటేయ్యండని కోరిన సంఘటనను కూడా మనం చూసాం. మరోవైపు చీరలపై మోడీ బొమ్మలను కూడా ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి నుదుట పెట్టుకునే బొట్టు బిళ్లల ప్యాకెట్‌పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు.
 
 
పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ విడుదల చేసిన బొట్ట బిళ్లల ప్యాకెట్‌పై ఒకవైపు నరేంద్రమోడీ, మరోవైపు బీజేపీ కమలం గుర్తు ముద్రించి ఉన్నాయి. పైభాగంలో హిందీలో ఫిర్ సే మోదీ సర్కార్ (మరోసారి మోడీ ప్రభుత్వం) అని రాసి ఉంది. ఈ ఫోటోలను పశ్చమ బెంగాల్  రాయ్‌గంజ్ నియోజకవర్గ ఎంపీ అయిన సలీం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
 
పేటీఎం బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు పరాస్ ఫ్యాన్సీ బిందీలకు ముఖచిత్రంగా మారిపోయారని ఎండీ సలీమ్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు నిజంగా కంపెనీ ముద్రించిందా లేక ఇంకెవరైనా అనధికార వ్యక్తులెవరైనా ముద్రించారా అన్నది తేలాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments