Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగంలో దుర్యోధనుడు నరేంద్ర మోడీ : ప్రియాంకా గాంధీ

Webdunia
బుధవారం, 8 మే 2019 (09:34 IST)
దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రిని నంబర్ వన్ అవినీతిపరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రిని కలియుగంలో దుర్యోధనుడుతో పోల్చారు. హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె నిప్పుల వర్షం కురిపించారు. 
 
దురహంకారమే దుర్యోధనుడి పతనానికి కారణమైందని, పవిత్ర భారతదేశం ఎన్నడూ కూడా దురహంకారాన్ని క్షమించదని హెచ్చరించారు. 'వాళ్లకు ఏ అంశం దొరకనప్పుడు మా కుటుంబాన్ని కించపరుస్తుంటారు. ఈ దేశం ఎప్పుడూ దురహంకారాన్ని క్షమించలేదు. దీనికి చరిత్రే సాక్ష్యం. మహాభారతం కూడా సాక్ష్యమే. ఇదే దురహంకారం దుర్యోధనుడికి కూడా ఉండేది. శ్రీకృష్ణుడు అతని వద్దకు వెళ్లి నిజమేమిటో చెబితే... శ్రీకృష్ణుడినే బంధించేందుకు ప్రయత్నించాడు' అని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి హెచ్చరికలను ప్రస్తావిస్తూ రాసిన ఒక పద్యం పంక్తులను ఆమె చదివి వినిపించారు. 
 
ఇదిలావుంటే రాజీవ్‌ను నంబర్ 1 అవినీతిపరుడుగా ప్రధాని మోడీ పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రధాని స్థాయిలో ఉన్న ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేసివుండకూడదని అంటున్నారు. అంతేనా.. ఢిల్లీ యూనివర్సిటీ ఉపాధ్యాయులు ఏకంగా ఓ ప్రకటనలో మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌ గాంధీపై అవమానకర వ్యాఖ్యలతో మోడీ ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments