Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు ఆకలిగా లేదంటున్నారా..? పిప్పళ్ల చూర్ణం వుందిగా? (video)

పిల్లలు ఆకలి లేదంటున్నారా..? అయితే పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేయకుండా ఇలా చేయాలి. చిన్నారుల పొట్టలో అన్నింటికీ చోటు ఉండదు. పాలతోనే ఆకలి నిండితే మిగిలినవి తినలేరని తల్లులు గుర్తుంచుకోవ

Webdunia
సోమవారం, 16 జులై 2018 (15:59 IST)
పిల్లలు ఆకలి లేదంటున్నారా..? అయితే పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేయకుండా ఇలా చేయాలి. చిన్నారుల పొట్టలో అన్నింటికీ చోటు ఉండదు. పాలతోనే ఆకలి నిండితే మిగిలినవి తినలేరని తల్లులు గుర్తుంచుకోవాలి. జలుబు ఉంటే తగ్గేవరకూ ఆగాలి. నులిపురుగులు ఉన్నట్లయితే మందులు వాడాలి. పిల్లలకు నచ్చేవిధంగా ఆహారాన్ని తయారు చేయాలి. 
 
ఆహారానికి ముందు చిరుతిళ్లు ఇవ్వకూడదు. ముఖ్యంగా చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు వంటివి అసలు పెట్టకూడదు. బాగా ఆడుకునేలా చూడాలి. దీంతో శరీరం బాగా అలిసిపోయి ఆకలేస్తుంది. అలాంటప్పుడు పోషకాహారం ఇవ్వాలి. ఆయుర్వేద దుకాణాల్లో పిప్పళ్లని దొరుకుతాయి. వాటిని నేతిలో దోరగా వేయించి చల్లారాక మెత్తటి చూర్ణంలా చేసి, పల్చని వస్త్రంలో జల్లించి భద్రపరుచుకోవాలి. 
 
పిల్లల వయసును బట్టి, పావు చెంచా నుంచీ అరచెంచా వరకూ తీసుకుని నెయ్యి, తేనె కలిపి రెండు పూటలా తినిపించాలి. అయితే నెయ్యి ఎక్కువగా, తేనె తక్కువ పరిమాణంలో కలపాలి. ఇలా చేస్తే పిల్లల కడుపులో నులిపురుగులు చేరవు. ఆకలి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పిప్పళ్లు, మోడి, శొంఠి, మిరియాలు సమపాళ్లల్లో కలిపిన చూర్ణాన్ని, రెండు గ్రాముల మోతాదులో అరస్పూను తేనెలో కలిపి సేవిస్తూ ఉంటే చాలా కాలంగా వేధిస్తున్న జలుబు, బొంగురు గొంతు సమస్యలు తగ్గిపోతాయి. పిప్పళ్లు, వస సమభాగాలుగా తీసుకుని, మూడు గ్రాముల మోతాదులో వేడినీటితో గానీ, పాలతో గానీ కలిపి రోజూ రెండు పూటలా తీసుకుంటే మైగ్రేన్‌ తగ్గుతుంది. 
 
రెండు గ్రాముల పిప్పళి చూర్ణానికి తేనె కలిపి, రోజుకు మూడు పూటలా సేవిస్తే అధిక బరువు తగ్గుతుంది. అయితే ఈ తీసుకున్న గంటవరకు నీళ్లు తప్ప ఇతర ఆహారం ఏదీ తీసుకోకూడదు. ఐదు గ్రాముల పిప్పళ్ల చూర్ణాన్ని అరకప్పు మజ్జిగలో కలిపి రెండు పూటలా సేవిస్తే ప్రసవానంతరం ఎత్తుగా మారిన పొత్తి కడుపు తగ్గిపోయి, పొట్ట చదునుగా అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments