ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోందా? అయితే ఇలా చేయండి

Webdunia
గురువారం, 14 మే 2020 (18:38 IST)
కరోనాను ఎదుర్కొనేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఐటి ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు(వర్క్ ఫ్రమ్ హోమ్). ఇంటి నుంచే పనిచేయడం కోసం వీరందరూ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై ఆధారపడ్డారు. వీరిలో ఎక్కువ శాతం మంది ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేసుకుని వాడుతున్నారు. 
 
ఎక్కువ సమయంపాటు ల్యాప్‌టాప్‌ను వాడటం వల్ల బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతుంది. అలా కాకుండా బ్యాటరీని ఆదా చేసుకోవాలనుకుంటే, క్రింద పేర్కొన్న సూచనలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుందాం.
 
* మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే బ్యాటరీ అధిక భాగం ఆదా అవుతుంది.
 
* ల్యాప్‌టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచుకోవాలి.
 
* ల్యాప్‌టాప్ ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి. వీలైతే కూలింగ్ ప్యాడ్‌లను ఉపయోగించండి.
 
* స్క్రీన్‌సేవర్‌లను పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఇది బ్యాటరీని అదనంగా ఉపయోగించుకుంటుంది.
 
* ల్యాప్‌టాప్ సాఫ్ట్‌వేర్ డ్రైవర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
 
* ల్యాప్‌టాప్‌పై చేయవలసిన పనులను వీలైనంత త్వరగా ముగించుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కువసేవు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments