ఆగస్టు నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్

Webdunia
గురువారం, 14 మే 2020 (18:35 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై మొదటి రోజు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం గురించి మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణ ఆర్థికం, వలస కూలీల సమస్యలు, రైతులు సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నాటికి దీనిని దేశ వ్యాప్తంగా అమలులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ప్రకారం రేషన్ కార్డ్ ఉన్నవారు దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దీన్ని పోర్టబిలిటీ విధానం అంటారు. 
 
తెలుగు రాష్ట్రాల మధ్య ఈ విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఇకపై ఇది దేశవ్యాప్తంగా అమలు కానుంది. దీని వల్ల 23 రాష్ట్రాలలోని 67 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ప్రజా పంపిణీలో భాగమైన 83 శాతం మందికి ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments