Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్...వాహనదారులకు ఝలక్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:49 IST)
కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ప్రొడక్టులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో వీటి ధరలు తగ్గే ఛాన్స్ లేదు. కరోనా మెడిసిన్స్‌పై జీఎస్‌టీ మినహాయింపు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. దీంతో ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నాయి.
 
ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ వంటి ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ఇకపై 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. అలాగే పార్లర్‌లో ఐస్‌క్రీమ్ తింటే 18 శాతం జీఎస్‌టీ పడుతుంది.
 
రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్స్‌పై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. బయో డీజిల్‌పై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. వికలాంగులు ఉపయోగించే వెహికల్స్‌పై జీఎస్‌టీని 5 శాతానికి కుదించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ ద్వారా అందించే ఫోర్టిఫైడ్ రైస్‌ మీద జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments