Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా కరకట్టపై ప్రమాదం: కెనాల్‌లోకి కారు.. ఒకరు మృతి

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:40 IST)
Canal
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోని కృష్ణా కరకట్టపై ఇన్నోవా వాహనం అదుపు తప్పి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుంచి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన ఆరుగురు కారులో విజయవాడ నుంచి మోపిదేవి గ్రామానికి వెలుతున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు కొత్తపాలెం సమీపంలోకి రాగానే.. అదుపు తప్పి ఓ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. 
 
ఈ ఘటనలో ప్రశాంత్‌(25) అనే యువకుడు అక్కడిక్కడే ప్రమాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. కాలువలోకి దిగి కారు అద్దాలు పగలకొట్టి కారులోని వారిని రక్షించారు.
 
సింహాద్రి శరత్ కు కాలికి గాయమైంది. దీంతో అతడికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments