Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు కెమెరాలు.. 12 జీబీ ర్యామ్.. అద్భుతమైన ఫీచర్లతో ఎంఐ 9

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:58 IST)
రోజుకో కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేస్తూ దేశీయంగా రోజురోజుకీ మొబైల్ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్న సంస్థ షియోమీ అగ్ర స్థానంలో దూసుకుపోతోంది. మిగిలిన కంపెనీల మొబైల్ ఫోన్‌లతో పోల్చితే ఎక్కువ ఫీచర్‌లు ఉన్న ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమీ తాజాగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ-9 విడుదల చేసింది.
 
ప్రపంచంలోనే క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అందించే ఫోన్ ఇదే కావడం విశేషం. 6.39 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఎంఐ-9 స్మార్ట్ ఫోన్ ధర రూ. 31,000 కాగా ఎంఐ-9 ఎక్స్‌ప్లోరర్ ధర రూ. 42,000గా నిర్ణయించారు. దీన్ని 6 జీబీ ర్యామ్ - 128 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ - 256 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌లలో అందిస్తున్నారు. 
 
ఈ ఫోన్ వెనుక ఉన్న మూడు కెమెరాలు 48, 12, 16 మెగా పిక్సెల్‌లతో అందించబడ్డాయి, దీని ముందువైపు కెమెరా 20 మెగా పిక్సెల్‌తో అందించబడింది. దీనికి గొర్రిల్లా 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌తో కూడా అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లలో ఇంత భారీ మొత్తంలో ర్యామ్ ఉండటం చాలా పెద్ద విశేషం. ఈ ఫోన్లు ఈ నెల 26 నుండి అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments