చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రపంచంలోనే మొదటిసారిగా 32ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో కూడిన స్మార్ట్ఫోన్ని విడుదల చేసింది. బుధవారం నాడు వివో వి15 ప్రో స్మార్ట్ఫోన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అని వివో మొబైల్ సంస్థ పేర్కొంది. మొబైల్కి వెనుకవైపున మూడు కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ను కూడా పొందుపరిచారు. దీని ప్రారంభ ధర రూ. 28,990గా నిర్ణయించారు. ఈ మోడల్ మార్చి 6వ తేదీ నుండి ఆన్లైన్ విక్రయ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది.