ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ అయిన వీవో.. కొన్ని స్మార్ట్ఫోన్ మోడల్స్పై 8,000 ప్లస్ 5,000 మొత్తం రూ.13వేల వరకు ఆఫర్ ప్రకటించింది. వీవో గత జూలైన నెలలో నెక్స్ మోడల్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలి ఇన్-డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ విడుదలైన కొత్తలో రూ.47,990 ధర పలికింది.
ప్రస్తుతం 8వేల రూపాయలను ఈ మోడల్కు తగ్గించడంతో రూ.39,990 ధరకు పలుకుబడి అయ్యింది. ఇంకా అమేజాన్లో ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.5వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించింది.