Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రాజకీయ ప్రకటనలకు స్వస్తి : ట్విట్టర్ సంచలన నిర్ణయం

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (19:33 IST)
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రకటనలకు స్వస్తి చెప్పాలని భావిస్తోంది. అయితే, రాజకీయ వార్తల సందేశాలకు మాత్రం అనుమతి ఇవ్వనుంది. 
 
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాల షేర్ చేయడం అధికమైపోయింది. దీంతో ఇలాంటి వార్తలను కట్టడి చేయడానికి ట్విట్టర్ చర్యలు చేపట్టింది. ఇకపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి రాజకీయ ప్రకటనలకు ఆస్కారం లేకుండా.. అన్ని రకాల పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్‌లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నిషేధం నవంబరు 22 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. అయితే ఈ నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 'రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప.. వాటిని కొనకూడదు' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం