కరోనా ప్రభావం.. ట్విట్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం.. మీడియాపై ఆంక్షలు

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (12:38 IST)
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ తన ఉద్యోగుల క్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోబ్లాగింగ్ సైట్ గా పేరుగాంచిన ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. చైనా వెలుపల కూడా అనేక దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా నమోదవుతుండడంతో తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో బయటి వాతావరణంలో కరోనా వ్యాప్తి వుండటంతో తన ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల్లో ఈ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విట్టర్ అధికారి జెన్నిఫర్ క్రిస్టీ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో, ఆసుపత్రి ప్రాంగణంలో పలు ఆంక్షలను విధించారు. కేసుల వివరాలను బయటకు వెల్లడించవద్దని వైద్యులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మాత్రమే కరోనాపై అప్ డేట్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఆసుపత్రి వద్ద మీడియాపై కూడా ఆంక్షలు విధించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments