Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్ఎన్ఎల్‌కు కొత్త చిక్కు.. ఉద్యోగుల కొరత.. వీఆర్ఎస్‌ భలే భలే

Advertiesment
BSNL
ఉద్యోగులు లేకుండా వినియోగదారుల సేవలను పూర్తి చేయలేక బీఎస్ఎన్ఎల్ సంస్థ సతమతమవుతోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నష్టాలను చవిచూసింది. ఒకటిన్నర లక్షల మంది పనిచేస్తూ వచ్చిన ఈ సంస్థలో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. 
 
గత ఆర్థిక ఏడాది బీఎస్ఎన్ఎల్ 18,300 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో సదరు సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇంకా ప్రయోజనకరమైన వీఆర్ఎస్ ఆఫర్లను ఇచ్చింది. 
 
ఈ పథకం ద్వారా 80వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఒకే సమయంలో 78,500 మంది ఆప్షనల్ రిటైర్మెంట్ తీసుకోవడంతో.. ప్రస్తుతం ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీంతో వినియోగదారుల సేవను సదరు సంస్థ పూర్తి చేయలేకపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రౌడీయిజం ప్రేరేపిస్తూ రాష్ట్ర అభివృద్ధికి గండికొడుతారా?: దేవినేని