ఇక ట్రూ కాలర్ అవసరం లేదు.. ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోతుంది..

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (22:36 IST)
సైబర్ నేరాల నియంత్రణకు గాను కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా నెంబర్ తీసుకుంటే వారికి ఇక చుక్కలే. ఫేక్‌ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్‌ కనెక్షన్‌ గానీ, వోటీటీ కనెక్షన్‌ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల 'కేవైసీ'లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు.
 
వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్‌ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్‌ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్‌ ఐడీ కార్డుతో కనెక్షన్‌ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
 
ఈ కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్‌ నెంబర్ల జాబితాలో లేని నెంబరు నుంచి కాల్‌ వచ్చినా సరే ఆ ఫోన్‌ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుస్తుంది.
 
కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్‌ యాప్‌తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్‌ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆదేశించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'ధురంధర్ : ది రివెంజ్'

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments