Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెషర్స్‌‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్‌.. 40వేల మందికి క్యాంపస్ ద్వారా ఉద్యోగాలు

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:00 IST)
ఐటీ దిగ్గజం, కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తాజాగా ఫ్రెషర్స్‌‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్‌లో 5 లక్షల మంది పనిచేస్తున్నారు. 
 
గతేడాది వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్స్‌ వర్చువల్‌గా ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యారని టీసీఎస్‌ గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు.
 
ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజే టీసీఎస్‌ ఈ శుభవార్త చెప్పింది. ఉద్యోగులను చేర్చుకునే క్రమంలో కొవిడ్‌ నిబంధనలు అడ్డంకిగా మారలేదని తెలిపారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌ గణపతి సుబ్రమణియమ్‌ తెలిపారు. 
 
ఖర్చు గురించి ఆందోళన లేదన్నారు. ఈ ఏడాది కూడా 40వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు లక్కడ్‌ చెప్పారు. వ్యాపార ఒప్పందాలు పుంజుకోగానే నియామకాలు ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments