Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు సుప్రీం కోర్టు ఎదురుదెబ్బ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:34 IST)
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు కొన్ని అసంబద్ధ విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం సీసీఐకి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు మార్కెట్‌ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లాంచింగ్ లాంటి వాటిని ఈ సందర్భంగా వ్యాపార మహాసంఘం సీసీఐ దృష్టికి తీసుకొచ్చింది. 
 
ఈ ఫిర్యాదుపై స్పందించిన సీసీఐ.. ఆ రెండు ఈ కామర్స్ కంపెనీల మీద గతేడాది జనవరిలో విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఈ రెండు కంపెనీల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments