అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు సుప్రీం కోర్టు ఎదురుదెబ్బ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:34 IST)
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు కొన్ని అసంబద్ధ విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం సీసీఐకి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు మార్కెట్‌ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లాంచింగ్ లాంటి వాటిని ఈ సందర్భంగా వ్యాపార మహాసంఘం సీసీఐ దృష్టికి తీసుకొచ్చింది. 
 
ఈ ఫిర్యాదుపై స్పందించిన సీసీఐ.. ఆ రెండు ఈ కామర్స్ కంపెనీల మీద గతేడాది జనవరిలో విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఈ రెండు కంపెనీల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments