Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో ఊరట.. 1.6లక్షల కోట్ల బకాయిలను..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (15:46 IST)
సుప్రీం కోర్టులో టెలికాం సంస్థలకు ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సి బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి సుమారు 1.6లక్షల కోట్ల బకాయిలను టెలికాం సంస్థలు చెల్లించాల్సి ఉంది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
వచ్చే ఏడాది 2021 మార్చి 31 పదిశాతం బకాయిలను చెల్లించాలని.. పదేళ్లల్లో (2031 నాటికి) ఏడీఆర్ బకాయిలన్నీంటిని చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే బకాయిల చెల్లింపులపై టెలికాం ఎండీలు, సీఈవోలు నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రస్తుత బ్యాంకు గ్యారంటీలు యథాతధంగా కొనసాగుతాయని, వడ్డీ చెల్లింపుల వివరాలు ప్రతి సంవత్సరం అందించాలని పేర్కొంది. ఇన్‌స్టాల్‌మెంట్లు, ఏజీఆర్  బకాయిలు చెల్లిచడంలో కంపెనీలు విఫలమైతే జరిమానా, వడ్డీతోపాటు కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదవుతుందని హెచ్చరించింది. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో భారతి ఎయిర్‌టెల్, ఐడీయా, వొడాఫోన్ వంటి సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments