కస్టమర్లకు రూ.60 వేల కోట్ల లాభం చేకూర్చిన జియో.. అంబానీకి థ్యాంక్స్ అంటూ...

దేశంలోని మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో ఏకంగా రూ.60 కోట్ల లాభం చేకూర్చింది. అలాగే, ఉచితంగా వాయిస్ కాల్స్ పేరిట వినియోగదారులపై ధరల పెనుభారాన్ని తగ్గించింది.

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (07:47 IST)
దేశంలోని మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో ఏకంగా రూ.60 కోట్ల లాభం చేకూర్చింది. అలాగే, ఉచితంగా వాయిస్ కాల్స్ పేరిట వినియోగదారులపై ధరల పెనుభారాన్ని తగ్గించింది. దీంతో రిలయన్స్ జియో అధిపతి ముఖేష్ అంబానీకి నెటిజన్లతో పాటు మొబైల్ వినియోగదారులు ధన్యవాదాలు చెపుతున్నారు. ఈ రూ.60 కోట్ల లాభం వెనుక మతలబును పరిశీలిస్తే...
 
భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ రిలయన్స్ జియో. 2016 సెప్టెంబరు నెలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకే ఒక్క ఐడియాతో డేటా రేట్లను పాతాళానికి దింపేసింది. అప్పటివరకు వందలు, వేల రూపాయలు వసూలు చేసిన టెలికాం కంపెనీలు సైతం పోటీ పడి మరీ డేటా ప్యాకేజీలు తగ్గించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. 
 
చివరకు ఉచిత డేటా ఆఫర్స్‌ను కూడా ఇవ్వాల్సి వచ్చింది. దీనికి కారణం జియో... జియో.. జియో. ఈ కంపెనీ సేవలు దేశీయ టెలికాం మార్కెట్‍లోకి వచ్చిన తర్వాత కస్టమర్లకు వచ్చిన లాభం ఎంతో తెలుసా.. అక్షరాల 60 వేల కోట్ల రూపాయలు. ఈ అంకెలు చూసి నోరెళ్లబెట్టొచ్చు కానీ.. ఇది అక్షర సత్యమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్‌నెస్ నివేదిక స్పష్టంచేసింది. 
 
2016 సెప్టెంబరులో సేవలు ప్రారంభించిన జియో.. తొలి ఆరు నెలల పాటు ఉచిత డేటాను ఇచ్చింది. ఆ తర్వాత రూ.149కే 28 రోజులు ప్రతి రోజు ఒక జీబీ డేటా ఇచ్చింది. జియోకి ముందు.. ఒక్క జీబీ డేటాకి రూ.152లను ఇతర టెలికాం కంపెనీలు వసూలు చేశాయి. ఈ లెక్కన గత యేడాదిన్నర కాలంలో భారతీయ వినియోగదారులకు డేటా రూపంలో 60 వేల కోట్ల రూపాయలు మిగిలింది.
 
అలాగే, జియో ఉచితంగా వాయిస్ కాల్స్ సదుపాయం కూడా ఇస్తుండటంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలోకి వచ్చాయి. ఈ రూపంలో కస్టమర్లు ఎంతో లాభపడ్డారు. ముఖ్యంగా, చుక్కల్లో ఉన్న డేటా ఛార్జీలను కిందకి దించి గ్రామీణులకు కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోకే దక్కిందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో డేటా ఛార్జీలను తగ్గించిన జియో థ్యాంక్స్ చెబుతూనే.. 60 వేల రూపాయల లాభం చేకూర్చిన ముకేష్ అంబానీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెపుతున్నారు నెటిజన్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments