కొత్త కస్టమర్లకు ఉచితంగా జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (08:37 IST)
దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వారికి ఉచితంగా సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
 
నిజానికి జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కొత్తగా ఒక కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద చెల్లిస్తారు. మినిమమ్‌ రీఫండబుల్‌ డిపాజిట్‌ తీసుకుని హోం గేట్‌వే రూటర్‌ను అందిస్తున్నారు. అలాగే, కంపనీ డాటా ఆడ్‌ ఆన్‌ ఓచర్లపై డబుల్‌ డాటాను అందిస్తుంది. నాన్‌ జియో వాయిస్‌ కాల్స్‌పై కూడా నిమిషాలను పెంచింది. 
 
కాగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కోసం కొత్త కనెక్షన్లకు ఫ్రీ బ్రాడ్‌ బాండ్‌ ప్లాన్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇపుడు ఈ దిశలోనే రిలయన్స్ జియో కూడా ముందుకు వచ్చింది. కరోనా వైరస్ భయం కారణంగా అన్ని కంపెనీలు తమతమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments