చైనాలో రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌ లాంచ్.. ప్రత్యేకతలు..

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:24 IST)
స్మార్ట్‌ఫోన్‌ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న షావోమీ సంస్థ చైనాలో రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో‌ను ఆవిష్కరించింది. కాగా తక్కువ ధరకే ఈ ఫోన్‌లను ప్రకటించడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ధర 999 యువాన్లు (రూ.10,000) కాగా, రెడ్‌మీ నోట్ 8 ప్రో 1,399 యువాన్లు (రూ.14,000) మాత్రమే. 
 
ఈ రెండు ఫోన్‌లు క్వాడ్(నాలుగు) కెమెరాలను కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు కావడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీడబ్ల్యూ1 సెన్సార్ ఉంది. ప్రస్తుతం షావోమీ సంస్థ ఈ ఫోన్లను చైనాలో మాత్రమే ప్రకటించింది. 
 
రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. దసరా, దీపావళి పండుగల సమయానికి భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
రెడ్‌మీ నోట్ 8 ప్రో ప్రత్యేకతలు..
* 6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
* 8 జీబీ ర్యామ్,
* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
* మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్,
 
* 64+8+2+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు,
* 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
 
* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
* ఆండ్రాయిడ్ 9 పై+ఎంఐయూఐ 10

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments