చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి తాజా ఉత్పత్తి రెడ్మి నోట్ 7 స్మార్ట్ఫోన్ గురించి మార్కెట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫోన్ లాంచ్ తేదీ మార్చికి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కంపెనీ ఆ వార్తలను ఖండించింది. ఇందు కోసం ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసింది. దీని ప్రకారం ఫోన్ మార్చిలో కాకుండా ఫిబ్రవరి నెలలోనే లాంచ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
రెడ్మి నోట్ 7ని ముందుగా చైనాలో లాంచ్ చేసారు. దీని ప్రారంభ ధర 999 చైనా యువాన్లుగా (దాదాపు రూ.10,300) నిర్ణయించారు. భారత్లో లాంచ్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టింది. ట్వీట్లో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరి 28, 2019న లాంచ్ చేయనుంది.