పబ్ జీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. త్వరలో భారత్‌‍లోకి సూపర్ గేమ్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:48 IST)
భారత్‌-చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. అప్పటి నుంచి పబ్‌జీ ప్రియులు ఆ గేమ్‌ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందా…? అంటూ ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో పబ్‌జీ సంస్థ తన ఆడియన్స్‌ కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న అప్‌ డేట్‌లతో వాళ్లలో ఆశలు రేకెత్తించేలా చేసింది. 
 
తాజాగా పబ్‌జీ మాతృ సంస్థ పబ్‌జీ పేరును 'బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా' గా మారుస్తూ కొత్త పోస్టర‍్లను విడుదల చేసింది. దీనికి సంబంధించి పబ్‌జీ సంస్థ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్‌ చేసింది. దీంతో పబ్‌జీ గేమ్‌ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
 
ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్‌ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని వేగం చేసింది. క్రాఫ్టన్ సంస్థ ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ లింక్డిన్‌‌లో పోస్టింగ్‌‌లను అప్‌ డేట్‌ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్‌ రిలేషన్‌ మేనేజర్‌ పోస్ట్‌కు రిక్రూట్‌ మెంట్‌ నిర్వహించింది.
 
దీంతో పాటు ప్రధాని మోడీ పీఎం కేర్స్‌కు రూ.1.5కోట్లు విరాళం ప్రకటించింది. తమ వంతు సాయంగా భారత్‌ ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ క్రాఫ్టన్‌ సీఈఓ చాంగ్హాస్‌ కిమ్‌ కూడా ప్రకటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: లెనిన్ తో ఈసారి వెనక్కి తగ్గేదేలే అంటున్న నాగార్జున అక్కినేని !

JDChakravarthi: ఎన్నో గాయాలను తట్టుకుని విడుదలకు సిద్ధమైన గాయపడ్డ సింహం

Sai Pallavi: హిందీతో సాయిపల్లవికి ఇబ్బందులు.. ట్రోల్స్ మొదలు

NTR, Charan: భారతీయ బాక్సాఫీస్‌ను ఏలడానికి రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ మరోసారి కలుస్తున్నారా?

Anil Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమానుంచి అనిల్ రావిపూడి తప్పుకున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

విశాఖపట్నంలో ఫరెవర్ న్యూ మొదటి స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో బ్రాండ్ బొటిక్‌ను ప్రారంభించిన లాంజీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ది బ్రాండ్ సారా అలీ ఖాన్

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

తర్వాతి కథనం
Show comments