పోకో ఎం3 ప్రో 5జీ.. త్వరలో భారత్‌లో విడుదల..

Webdunia
బుధవారం, 19 మే 2021 (19:16 IST)
poco 2
గ్లోబల్ మార్కెట్‌లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. పోకో నుంచి పోకో ఎం3 ప్రో 5జీ వచ్చేసింది. ఇటీవల కాలంలో వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలన్నీ 5జీ మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు పోకో ఎం3 ప్రో 5జీ రిలీజ్ అయింది. 
 
గ్లోబల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
 
18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 22.5 వాట్ ఛార్జల్ లభించడం విశేషం. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంఛ్ కానుంది. 
 
పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర 179 యూరోలు కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర 199 యూరోలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments