Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై హింద్' .. పవన్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య ఇదీ...

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:03 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడు. 
 
జ‌న‌సేన పార్టీతో రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన పవ‌న్ ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు స‌మాజంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ని త‌న వంతు బాధ్య‌త‌గా ప‌రిష్క‌రించుకుంటూ వెళుతున్నారు. రీసెంట్‌గా వ్యవసాయ విద్యార్థుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ వెంటనే వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఉద్దానం స‌మస్య‌ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకొని దాని ప‌రిష్కారం కోసం ప‌లువురితో ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నారు. జ‌న‌సేన పార్టీని స్థాపించిన త‌ర్వాత‌ ప‌వన్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2014 ఆగస్టులో తన ట్విటర్‌ ఖాతాను ప్రారంభించిన ప‌వ‌న్ చివ‌రిగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణ హత్య ఘటనపై చివ‌రిగా స్పందించారు. అయితే ఈ రోజుతో ప‌వన్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ రెండు మిలియ‌న్స్‌కి చేరింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments