Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో అర్కూట్‌కు సంబంధించిన మీమ్స్ వైరల్

Webdunia
బుధవారం, 26 మే 2021 (17:51 IST)
Orkut
నూతన ఐటీ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లపై కేంద్రం నిషేధం విధిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు గతంలో మంచి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వాడి వదిలేసిన ప్లాట్‌ఫామ్.. అర్కూట్‌కు సంబంధించి మీమ్స్ షేర్ చేస్తున్నారు.
 
గత ఫిబ్రవరి 25వ తేదీన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) నూతన ఐటీ నిబంధనలను నోటిఫై చేసింది. మూడు నెలల్లో ఐటీ నిబంధనలను పాటించాలని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కూ తదితర సోషల్ మీడియా సంస్థలను కేంద్రం కోరింది. 
 
ఒకవేళ నిబంధనలను పాటించకపోతే, భారత్‌లో సదరు కంపెనీల లావాదేవీలకు తక్షణం తెర పడినట్లేనని అధికార వర్గాలు తెలిపాయి. ఈ హ్యాష్‌ట్యాగ్‌లు పోస్ట్ చేయడంతోపాటు ట్విట్టర్ యూజర్లు ఆర్కూట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంగతి ప్రస్తావిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 30న ఇది పూర్తిగా మూతపడింది.
 
2000వ దశకం చివరిలో సెర్చింజన్ గూగుల్‌.. సొంతంగా అర్కూట్ పేరిట సోషల్ మీడియా వేదికను నిర్వహించింది. అప్పట్లో అత్యధికులు వాడిన సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఇది ఒకటిగా నిలిచింది. 
 
సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ రూల్స్‌ను అమలు చేయాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు. దేశ డిజిటల్ మీడియాలో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సమగ్ర భాగం అని, తప్పించుకోవడానికి వీల్లేదని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments