Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహో 'ఓప్పో'... మొదటి 5జి స్మార్ట్‌ఫోన్ రిలీజ్... మార్కెట్లో కుమ్ముడే కుమ్ముడు

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:31 IST)
మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన మొదటి 5జి ఫోన్‌ను ప్రదర్శించింది. అయితే ఈ 5జి స్మార్ట్ ఫోన్‌ను ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒప్పో సంస్థ తమ మొట్టమొదటి 5జి స్మార్ట్ ఫోన్ ప్రపంచవ్యాప్త పరీక్ష సేవల సంస్థ అయిన స్పార్టాన్ ఇంటర్నేషనల్ ఇంక్ నిర్వహించిన 5జి సీఈ పరీక్షలో విజయవంతంగా నెగ్గినట్లు ఒప్పో సంస్థ సోమవారం ప్రకటించింది.
 
యూరోపియన్ మార్కెట్‌లలో ఆరోగ్యం, భద్రత, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ అనుకూలత, వైర్‌లెస్ వంటి రంగాల్లో ప్రవేశించాలంటే సీఈ ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి. తమ సరికొత్త 5జి పరికరం యూరప్ ప్రజల వినియోగ అవసరాలకు తగినట్లుగా ఉందని ఒప్పో సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఒప్పో తయారుచేసిన సరికొత్త 5జి ఫోన్‌ను ప్రదర్శించారు. అనేక దేశాలు, ప్రాంతాల్లో విస్తరించిన ఎక్కువ బ్యాండ్ కాంబినేషన్లు, విస్తృత బ్యాండ్‌విడ్త్‌లలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments