Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహో 'ఓప్పో'... మొదటి 5జి స్మార్ట్‌ఫోన్ రిలీజ్... మార్కెట్లో కుమ్ముడే కుమ్ముడు

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:31 IST)
మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన మొదటి 5జి ఫోన్‌ను ప్రదర్శించింది. అయితే ఈ 5జి స్మార్ట్ ఫోన్‌ను ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒప్పో సంస్థ తమ మొట్టమొదటి 5జి స్మార్ట్ ఫోన్ ప్రపంచవ్యాప్త పరీక్ష సేవల సంస్థ అయిన స్పార్టాన్ ఇంటర్నేషనల్ ఇంక్ నిర్వహించిన 5జి సీఈ పరీక్షలో విజయవంతంగా నెగ్గినట్లు ఒప్పో సంస్థ సోమవారం ప్రకటించింది.
 
యూరోపియన్ మార్కెట్‌లలో ఆరోగ్యం, భద్రత, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ అనుకూలత, వైర్‌లెస్ వంటి రంగాల్లో ప్రవేశించాలంటే సీఈ ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి. తమ సరికొత్త 5జి పరికరం యూరప్ ప్రజల వినియోగ అవసరాలకు తగినట్లుగా ఉందని ఒప్పో సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఒప్పో తయారుచేసిన సరికొత్త 5జి ఫోన్‌ను ప్రదర్శించారు. అనేక దేశాలు, ప్రాంతాల్లో విస్తరించిన ఎక్కువ బ్యాండ్ కాంబినేషన్లు, విస్తృత బ్యాండ్‌విడ్త్‌లలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments