Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదు..

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (15:11 IST)
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదని జర్మనీలో నిషేదాలు విధించారు. నోకియా కంపెనీ పేటెంట్‌ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్‌ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌పై జర్మనీలో నిషేధం విధించింది.
 
స్థానిక కోర్పు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వన్ ప్లస్, ఒప్పో తమ ఉత్పత్తులను జర్మనీలో ఇక అమ్మలేవని తెలిపింది. యూరప్‌ వ్యాప్తంగా నోకియా హక్కుదారు కావడం గమనార్హం. 
 
నోకియా సుమారు 129 బిలియన్‌ యూరోల పెట్టుబడితో 5జీ నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్‌ చేసే టెక్నాలజీ పేటెంట్‌ హక్కులు పొందింది. అలాంటి నోకియాతో ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు ఒప్పందం చేసుకోకుండా, లైసెన్స్‌ తీసుకోకుండా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తూ నోకియా కంపెనీ 2021, జులైలో ఆసియా, యూరప్‌లోని పలు దేశాల్లో కేసు నమోదు చేసింది. 
 
ఒప్పో కంపెనీ.. నోకియాతో 2018 నవంబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ 2021 జూన్‌తో ముగిసిపోనుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒప్పో ఈ లైసెన్స్‌ను పునరుద్ధరించకపోగా, రెన్యూవల్ ఆఫర్‌ను కూడా ఒప్పో తిరస్కరించినట్లు నోకియా ఆరోపిస్తోందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments