భారత్లో నోకియా 5.3 పేరిట ఓ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ భారత్లో విడుదల చేసిన ఈ నోకియా 5.3 స్పెసిఫికేషన్లు అదిరేలా వున్నాయి. ఈ ఫోను 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. ఇందులో 6.55 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు.
స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ను, 6జీబీ వరకు ర్యామ్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
నోకియా 5.3 స్మార్ట్ ఫోన్ క్యాన్, శాండ్, చార్కోల్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 4జీబీ ర్ఆయమ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,499 ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫోన్ను అమేజాన్లో విక్రయిస్తారు.
* 6.55 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 720 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్