Webdunia - Bharat's app for daily news and videos

Install App

No NEFT service.. 14 గంటల వరకు బంద్.. ఎప్పుడంటే?

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:39 IST)
అసలే లాక్‌డౌన్.. ఏటీఎంల వెంట పడకుండా నెఫ్ట్, ఆన్ లైన్ లావాదేవీలు కానిచ్చేస్తున్నారు జనం. అయితే తాజాగా నెఫ్ట్ సేవలు 14 గంటల పాటు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు నెఫ్ట్ ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు నెఫ్ట్ సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
 
సాంకేతిక కారణాల రీత్యా నెఫ్ట్ సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. టెక్నికల్ అప్ గ్రేడ్ కోసం మే 22న బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ చేయనున్నట్టు తెలిపింది. మే 23న 00.01 గంటల నుంచి (మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు.
 
మరోవైపు ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. నెఫ్ట్ సేవలకు సంబంధించి ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు సమాచారం అందిస్తాయని తెలిపింది. 
 
ఏప్రిల్‌ 18న ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్‌ బ్యాంక్ టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. 2019 డిసెంబరు నుంచి నెఫ్ట్ సేవలను 24×7 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments